ఆర్కేపురం, జూన్ 9 : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల స్వర్ణయుగం నడుస్తున్నదని, తెలంగాణలో ఆంజనేయ స్వామి గుడిలేని ఊరు ఉండదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని గడప ఉండదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్కేపురంలోని ఓ ఫంక్షన్హాల్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. రూ.200 ఉన్న ఆసరా పెన్షన్లు రూ.2వేలకు పెంచారు. గతంలో ఇవి 20లక్షల మందికి మాత్రమే అందేవని, నేడు 44లక్షల మందికి అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణులకు ప్రభుత్వం తల్లిగారింటి పాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుతం రక్తహీనత సమస్య రూపుమాపేందుకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళితబధు వంటి పథకాలు ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా పూర్తి పారదర్శకంగా అందజేస్తున్నామన్నారు.
కుల, చేతి వృత్తులకు సంబంధించి 9 మంది లబ్ధిదారులకు మంత్రి చెక్కులు అందజేశారు. అలాగే సరూర్నగర్ స్వయం సహాయ సంఘానికి కోటి 25లక్షల రూపాయల రుణాల చెక్కు, షాదీ ముబారక్ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేసి, నూతన జంటలను ఆశీర్వదించారు. అలాగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంత్రి మాంఖాల్ గ్రామంలో గొల్లకుర్మలకు గొర్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, కందుకూరు ఆర్డీవో సూరజ్ కుమార్, జెడ్పీటీసీ జంగారెడ్డి, జోనల్ కమిషనర్ పంకజ, తహసీల్దార్ జయశ్రీ, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్, ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్ గొడుగు శ్రీనివాస్, నియోజకవర్గ యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, నియోజవర్గ మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు పటేల్ సునితారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమళ్ల రామ్నర్సింహ, మాజీ కార్పొరేటర్ పారుపలి అనితాదయాకర్రెడ్డి, నాయకులు సిద్ధగోని వెంకటేశ్గౌడ్, లింగస్వామిగౌడ్, ఎం.ఏ.సాజిద్, పెంబర్తి శ్రీనివాస్, జై శ్రీమన్నారాయణ, కంచర్ల శేఖర్, దుబ్బాక శేఖర్, ఫరీద్ పాషా, జగన్, సంతోష్, దేవేందర్, శంకర్నాయక్, మారం సుజాతారెడ్డి పాల్గొన్నారు.