మేడ్చల్ /శామీర్పేట/ కీసర : సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. 9 అంశాల ప్రాతిపదికన ఉత్తమ పంచాయతీలకు ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్’ పురస్కారాలను గురువారం మేడ్చల్, మూడుచింతలపల్లి, శామీర్పేట, కీసరలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయా మండలాలు ఎంపీపీలు రజితారాజమల్లారెడ్డి, హారికామురళీగౌడ్, ఎల్లబాయిబాబు, ఇందిరాలక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడు తూ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక చరిత్ర అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు అపరిశుభ్ర పరిసరాలతో, సౌకర్యా లు లేకుండా ఉన్న పంచాయతీలు నేడు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయన్నారు. ప్రతి పల్లె మౌలిక వసతులు సమకూర్చుకొని, ఆదర్శంగా నిలుస్తుందన్నా రు. జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికయ్యే స్థాయికి చేరుకోవడం సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శన మన్నారు. సీఎం దత్తత గ్రామాలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాయని, రాష్ట్రంలోని 12769 గ్రామ పంచాయతీల్లో మూడుచింతలపల్లి మండలంలోని గ్రామాలు నంబ ర్ వన్ స్థానంలో ఉన్నాయని అన్నారు.
మేడ్చల్లో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన డబిల్పూర్, రాజబొల్లారం, మైసిరెడ్డిపల్లి, రాయిలాపూర్, రావల్కోల్, సైదోనిగడ్డ తండా, పూడూరు, నూతన్కల్, గౌడవెల్లి, రాజబొల్లారం తండా, ఎల్లంపేట, కోనాయిపల్లి, సోమారం, ము నీరాబాద్, లింగాపూర్, బండమాదారం, శ్రీరంగవరం పంచాయతీలకు మంత్రి అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శైలజారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, ఎంపీడీవో పద్మావతి, వైస్ ఎంపీపీ వెంకటేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, రాష్ట్ర సర్పంచ్ ఫోరం ఉపాధ్యక్షుడు విజయానందారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీర్ల దయానంద్ యాదవ్, నాయకులు రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, గోపాల్రెడ్డి, రామోదర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సురేశ్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
శామీర్పేట, మూడుచింతపల్లిలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గాదయాకర్రెడ్డి, ఎంపీపీలు హారికమురళిగౌడ్, ఎల్లూభాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, వైస్ ఎంపీపీలు శ్రీనివాస్రెడ్డి, సుజాత, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ భాస్కర్యాదవ్, వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీడీవోలు వత్సలాదేవి, వాణి, తహసీల్దార్లు వాణిరెడ్డి, సత్యనారాయణ, ఎంపీవో రవినాయక్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. కీసరలో చీర్యాల్, యాద్గార్పల్లి, కీసర, కరీంగూడ, భోగా రం, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి, గోధుమకుంట,నర్సంపల్లి, రాంపల్లిదాయర పంచాయతీలకు మంత్రి అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో మంగతాయ రు, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్లు ధర్మేందర్, రాజుముదిరాజ్, గోపాల్రెడ్డి, కవితజైహింద్రెడ్డి, విమలనాగరాజు, పెంటయ్య, మహేందర్రెడ్డి, సత్తమ్మ, ఆండాలుమల్లేశ్, ఎంపీటీసీలు నారాయణశర్మ,వెంకటేశ్, కిరణ్జ్యోతి, వెంకట్రెడ్డి, కవితశశికాంత్, మండల కో-ఆప్షన్ సభ్యులు బషారత్అలీ, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.