ఘట్కేసర్ రూరల్, జూలై 8 : పల్లె ప్రగతి ద్వారా గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి పేర్కొన్నారు. మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో ఆయన గురువారం పర్యటించారు. కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ పరమేశ్వర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి మధు పాల్గొన్నారు. అలాగే కాచవానిసింగారం గ్రామాన్ని డీఆర్డీవో పద్మజరాణి పరిశీలించారు. ఎంపీపీ ఏనుగు సదర్శన్ రెడ్డి, ఎంపీడీవో అరుణ, సర్పంచ్ వెంకట్ రెడ్డి, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.
కీసర : కీసర మండల కేంద్రం… హరిజనవాడలో శిథిలావస్థలో ఉన్న ఇంటిని సర్పంచ్ నాయకపు మాధురి జేసీబీతో తొలగించారు. మండల పరిధిలోని గ్రామాల్లో సర్పంచులు మొక్కలు నాటి, పారిశుధ్య పనులు చేపట్టారు. వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, సర్పంచులు మహేందర్రెడ్డి, పెంటయ్య, రాజుముదిరాజ్, విమల నాగరాజు, సత్తమ్మ, గోపాల్రెడ్డి, ఆండాలుమల్లేశ్ పాల్గొన్నారు.
మండల పరిధిలోని డబిల్పూర్, పూడూరు, మునీరాబాద్, రావల్కోల్, గౌడవెల్లి తదితర గ్రామాల్లో సర్పంచులు పర్యటించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు ఇంటింటికీ పంపిణీ చేశారు.
శామీర్పేట : కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం దత్తత మండలం మూడుచింతలపల్లి, శామీర్పేట మండలాల్లో గురువారం నిర్వహించిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని ఇంటింటికీ 6 మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృక్ష సంపదను పెంచే దిశగా ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యాంసన్, నర్సింహా రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, ఎంపీపీ హారికామురళీగౌడ్, జడ్పీటీసీ అనితాలాలయ్య, వైస్ ఎంపీపీ సుజాత, ప్రత్యేక అధికారి సునీత, సర్పంచులు అనురాధారవీందర్రెడ్డి, గోపీనాయక్, రవి, విష్ణువర్ధన్రెడ్డి, ఆంజనేయులు, గీతామహేందర్, పాల్గొన్నారు.