పీర్జాదిగూడ, బోడుప్పల్ జూన్ 5: కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధి మేడిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో సూపర్ స్ప్రెడర్ల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను మంత్రి స్థానిక మేయర్ జక్క వెంకట్రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించా రు. అనంతరం, బోడుప్పల్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను సైతం మంత్రి మేయర్ బుచ్చిరెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మ ల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, వారి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా నే సూపర్ స్ప్రెడర్లను గుర్తించి కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి రోజు వెయ్యి మంది సూపర్ స్ప్రెడ ర్స్ బోడుప్పల్ కేంద్రం ద్వారా టీకా తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్, కమిషనర్ శ్రీనివాస్, దయాకర్రెడ్డి, హరిశంకర్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, నవీన్రెడ్డి, సుభాశ్ నా యక్, బచ్చరాజు, మహేశ్, మల్లేశ్, నాయకులు శ్రీధర్రెడ్డి, ఈశ్వర్రెడ్డి, అంజిరెడ్డి, రవీందర్, కృష్ణా గౌడ్, బుచ్చి యాదవ్, పాల్గొన్నారు.