సికింద్రాబాద్, అక్టోబర్ 10: జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం న్యూ బోయిన్పల్లిలోని మంత్రి మల్లారెడ్డిని తన నివాసంలో కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు కలిసి సన్మానించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో గ్రేటర్లో కంటోన్మెంట్ విలీనానికి మంత్రి మల్లారెడ్డి మద్దతు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్లోని నాలుగు లక్షల మంది ప్రజల ఆకాంక్షల మేరకు తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కంటోన్మెంట్ను విలీనం చేసేందుకు సర్కారు దృష్టికి మరోమారు తీసుకెళ్లి త్వరిగతిన ప్రక్రియ పూర్తయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మల్కాజిగిరి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గడ్డం ఎబెల్, సంకి రవీందర్, ప్రభు గుప్తా, ముప్పిడి మధూకర్, అరుణ్ యాదవ్, మహ్మద్ ఫసీ పాల్గొన్నారు.