అంబర్పేట, జూలై 23: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసుల ఇమేజ్ పెరిగిందని, సీఎం కేసీఆర్ వారికి కావాల్సిన అన్ని వసతులు కల్పించడంతో మన పోలీసు వ్యవస్థ దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. అంబర్పేట ఎస్ఏఆర్, సీపీఎల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మోటార్ ట్రాన్స్పోర్టు షెడ్ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, నగర సీపీ అంజనీకుమార్, నగర అడిషనల్ సీపీ క్రైమ్స్ షీఖా గోయల్, అడిషనల్ సీపీ ట్రాఫిక్ అనిల్ కుమార్, అడిషనల్ సీపీ, సీపీఎల్ కమాండెంట్ డీఎస్.చౌహాన్తో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ శుక్రవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. అంబర్పేట సీపీఎల్లో శిథిలావస్థకు చేరిన పోలీసు క్వార్టర్స్ స్థానంలో కొత్తవి నిర్మించేందుకు సీఎంతో మాట్లాడుతానని తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి బీపీ చెక్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కమాండెంట్ మురళి, ఈస్ట్జోన్ డీసీపీ, జాయింట్ సీపీ రమేశ్, పలువురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.