సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): జలమండలి ఉద్యోగులకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు హెల్త్ కార్డులను అందించారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం జలమండలి ఎండీ దానకిశోర్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం హెల్త్ ఇన్యూరెన్స్ కల్పించింది. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జలమండలి ఉద్యోగులు హెల్త్ కార్డులను అందుకున్నారు.
3,609 మంది ఉద్యోగులు, 894 మంది పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షన్లు అందుకుంటున్న 548 మందికి, సుమారు 10 వేల మంది వరకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆరోగ్య బీమా వర్తించనున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న వెయ్యి ప్రముఖ ఆస్పత్రుల్లో ఇక నుంచి జలమండలి ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఏడాదికి రూ.3 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు.
ఉద్యోగి, పెన్షనర్తో పాటు వారిపై ఆధార పడిన ఐదుగురు కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆరోగ్య బీమా వర్తిస్తుంది. హెల్త్ ఇన్యూరెన్స్కు సంబంధించి ప్రతియేటా రూ.6.78 కోట్ల ప్రీమియం మొత్తాన్ని జలమండలి చెల్లిస్తుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, సీజీఎంలు విజయ రావు, ఖాదర్, ఉద్యోగులు, వాటర్ వర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ రాంబాబు యాదవ్, అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రాజిరెడ్డి, జనరల్ సెక్రటరీ బి. జైరాజ్, వరింగ్ ప్రెసిడెంట్లు జి.లక్ష్మీనారాయణ, సయ్యద్ అక్తర్ అలీ, రామచంద్రారెడ్డితో పాటు ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.