శేరిలింగంపల్లి, మార్చి 10 : ప్రజలందరూ తమ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) ఆధ్వర్యంలో కిడ్నీ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రన్ను జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు హాస్పిటల్స్, డాక్టర్లు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజిస్టు డాక్టర్ వరుణ్, డాక్టర్ సి.మల్లికార్జున, డాక్టర్ పీసీ రెడ్డి, డాక్టర్ దీపక్ రాగూరి, డాక్టర్ క్రాంతి, డాక్టర్ తైఫ్, డాక్టర్ లీలాకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.