సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో మెట్రో రైళ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాల ఫ్రీక్వెన్సీతో, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 4 నిమిషాల ఫ్రీక్వెన్సీతో నడుపుతామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
మంగళవారం రాత్రి మెట్రో రైళ్ల రాకపోకలపై సమీక్ష నిర్వహించిన ఆయన ఎల్అండ్టీ ఎమ్ఆర్హెచ్ఎల్ ఎండీ కేవీబీ రెడ్డితో కలిసి చర్చించి, రాత్రి 9 గంటల తర్వాత రద్దీ ఉంటే అదనపు మెట్రో సేవలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్టేడియం మెట్రో స్టేషన్లో 10 కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.