సిటీబ్యూరో, సెప్టెంబరు 5 (నమస్తే తెలంగాణ): కరోనా తగ్గుముఖం పట్టడం, సాధారణ కార్యకలాపాలు ఊపందుకోవడంతో ప్రయాణికుల అవసరాలను గుర్తించి మెట్రో రైళ్ల వేళలను పొడిగించారు. ఇప్పటి వరకు రాత్రి 9.30కి బయల్దేరే చివరి రైలు సోమవారం (నేటి) నుంచి రాత్రి 10.15 గంటలకు బయల్దేరుతుందని అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు మొదటి రైలు, రాత్రి 10.15 గంటలకు ఆఖరి రైలు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామని మెట్రో రైలు అధికారులు వెల్లడించారు.