నగరవాసులకు త్వరలోనే మరో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ప్రస్తుత రద్దీ.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా హెచ్ఎంఆర్ తరహాలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో మెట్రో నియో ప్రాజెక్టు చేపట్టాలని సర్కారు సంకల్పించింది. ఇందులోభాగంగా హైదరాబాద్ మెట్రో రైల్, యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశాయి. ఇప్పటికే మియాపూర్ వరకు మెట్రో కనెక్టివిటీ ఉండటంతో అక్కడి నుంచి ఐటీ కారిడార్లోని పలు ప్రాంతాలను కలుపుతూ.. తక్కువ వ్యయం అయ్యే నియో ప్రాజెక్టును చేపడితే సరిపోతుందని సర్వేలో గుర్తించారు. కేపీహెచ్బీకాలనీ -గచ్చిబౌలి -కోకాపేట వరకు సుమారు 24 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): విశ్వ నగరంగా మారుతున్న గ్రేటర్ హైదరాబాద్లో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మెట్రో రైలు తరహాలోనే మెట్రో నియో ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థతో పాటు హెచ్ఎండీఏ పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలు క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహించాయి. కేపీహెచ్బీ కాలనీ నుంచి హైటెక్ సిటీ మీదుగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్-కోకాపేట వరకు సుమారు 24 కిలోమీటర్ల మేర మెట్రో నియో ప్రాజెక్టును చేపట్టాలని అధికారులు అంతిమంగా నిర్ణయించారు. ఇప్పటికే నగరంలో మెట్రో రైల్ ప్రాజెక్టు ఎల్బీనగర్ నుంచి కేపీహెచ్బీ మీదుగా మియాపూర్ వరకు ఉండడంతో అక్కడి నుంచి ఐటీ కారిడార్లోని పలు ప్రాంతాలను కలుపుతూ మెట్రో నియో ప్రాజెక్టును చేపడితే సరిపోతుందని క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో గుర్తించారు.
సాధారణంగా మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి కిలోమీటర్కు సుమారు రూ.250 కోట్లు ఖర్చవుతుండగా మెట్రో నియో ప్రాజెక్టును 40 శాతం తక్కువ వ్యయంతోనే నిర్మించే అవకాశం ఉందని మెట్రో అధికారులు తెలిపారు. ఒక మార్గంలో ఒక గంటలో 25 వేల లోపు మంది ప్రయాణం చేసేందుకు మెట్రో నియో లాంటి ప్రాజెక్టులు సరిపోతాయని అధికారులు పేర్కొంటున్నారు. అందుకే కేపీహెచ్బీ కాలనీ వైపు నుంచి హైటెక్ సిటీ మీదుగా గచ్చిబౌలి, నానక్రాంగూడ, కోకాపేట వరకు రానున్న 20 నుంచి 30 ఏండ్ల వరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మెట్రో నియో ప్రాజెక్టును చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అంతేకాక ఈ ప్రాజెక్టు నిర్మాణానికి స్థల సేకరణ ఎక్కువగా అవసరం ఉండదని.. ప్రస్తుతం ఉన్న మెట్రో స్టేషన్ల తరహాలో భారీ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. ముఖ్యంగా మెట్రో నియోలో రైలు బోగీలు కాకుండా ఎలక్ట్రికల్ బస్సులు ఉంటాయి. దీంతో ట్రాక్లు వేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ప్రజా రవాణా వ్యవస్థకు సరిగ్గా ఇలాంటి ప్రాజెక్టులే సరిపోతాయని భావించి కేపీహెచ్బీ నుంచి కోకాపేట వరకు 24 కిలోమీటర్ల దూరం మెట్రో నియో లాంటి ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఐటీ కారిడార్ వైపే ట్రాఫిక్ అధికం..