సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ) : వ్యాపార సంస్థల వద్ద డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకుని చెత్తను అందులో వేయాల్సిన బాధ్యత వ్యాపారులదేనని, ఆ చెత్త బిన్ను తీసుకెళ్లే బాధ్యత తమ కార్పొరేషన్ నిర్వహిస్తుందని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన అన్నారు. మాదాపూర్లోని కమిషనర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతీ రోజు ఒక వార్డు పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో టాప్ 5 సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్కిళ్లలో కూడా ప్రజావాణి నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.