మేడ్చల్, ఆగస్టు 10: హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలని మేడ్చల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చీర్ల రమేశ్ సూచించారు. మున్సిపాలిటీలో ఆయన గురువారం ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి, సంరక్షించాలన్నారు.
గుండ్లపోచంపల్లిమున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఎస్ఎస్ఎస్ క్లబ్ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా కళాశాల కార్యదర్శి టీవీ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలత విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పీఆర్వో రవిసుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రో గ్రాం అధికారి డాక్టర్ రాజేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
కీసర,ఆగస్టు 10: మేరామిట్టి మేరా దేశ్ కార్యక్రమం లో భాగంగా కీసర మండల పరిధి తిమ్మాయిపల్లి, భోగా రం తదితర గ్రామాల్లో గురువారం సర్పంచ్లు సిబ్బం ది, వార్డు సభ్యులతో కలిసి 75 మొక్కలను నాటారు. కార్యక్రమంలో తిమ్మాయిపల్లి సర్పంచ్ పెంటయ్య, భోగారం సర్పంచ్ కవితజైహింద్రెడ్డి, ఉప సర్పంచ్లు, వార్డుసభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 10: మండల పరిధి కాచవానిసింగారంలో గురువారం మేరీమిట్టి మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ వెంకట్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మేడ్చల్ డీఎల్పీవో స్మిత స్థానికు లతో కలిసి 75 మొక్కలు నాటా రు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జంగమ్మ, కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు విష్ణుగౌడ్, రజిత, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్, ఆగస్టు 10: మేడ్చల్ మండలంలోని గురువారం మేరీమిట్టీ మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని శ్రీరంగవరం గ్రామంలో జాతీ య గీతం ఆలపించి 75 మొక్కలు నాటారు. అనంతరం దుండిగల్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. కార్యక్రమంలో మేడ్చల్ ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయనందరెడ్డి, ఎంపీడీవో పద్మావతి, సర్పంచ్ విజయనందరెడ్డి, ఎంపీటీసీ ప్రకాశ్, ఉప సర్పంచ్ నర్సింహ, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదే విదంగా మండలంలోని రాజబొల్లారం గ్రామంలోని పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు రవి నాయక్, మోహన్బాబు, శ్రీనివాస్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
జవహర్నగర్: హరితహారంలో భాగంగా గురువారం కార్పొరేషన్లోని 21వ డివిజన్ కార్పొరేటర్ ప్రేమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు భాస్కర్, ఉపాధ్యక్షుడు నాగేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గణేశ్, యూత్ అధ్యక్షుడు రమేశ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
శామీర్పేట, ఆగస్టు 10 : మేరీ మిట్టి మేరా దేశ్లో కార్యక్రమంలో భాగంగా శామీర్పేట మినీ స్టేడియంలో గురువారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆర్ఏఎఫ్ అధికారులతో కలిసి 75 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథులుగా విచ్చేసిన సీఈవో దేవసహాయం, డీపీవో రమణమూర్తి పాల్గొన్నారు.అదే విధంగా శామీర్పేటలోని టీఎస్డబ్ల్యూఆర్బీసీ జగద్గిరిగుట్ట కళాశాలలో ఆజాదికా అమృత మహోత్సవంలో భాగంగా కళాశాలలో ప్రోగ్రామ్ ఆఫీసర్ వి.స్రవంతితో కలిసి ఎన్ఎస్ఎస్ వలంటీర్స్, విద్యార్థులు మట్టితో ప్రతిమలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లూభాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, సర్పంచ్ బాలమణి, వైస్ ఎంపీపీ సుజాత, ఉపసర్పంచ్ రమేశ్యాదవ్, ఎంపీడీవో వాణి, ఎంపీవో మంగతాయారు, ఆర్ఏఎఫ్ అధికారులు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.