కంటోన్మెంట్/మారేడ్పల్లి/బొల్లారం, సెప్టెంబర్ 12: పేద ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సంజీవయ్య కాలనీ, సీబీఎన్నగర్ల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు, తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రం, అన్నా నగర్లో ఏర్పాటు చేసిన యూపీహెచ్సీని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్,టీఎస్ఎంఐడీసీ, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ళ శ్రీనివాస్, గజ్జెల నగేష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి లాస్య నందిత, మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వైద్య సేవల కోసం పేద ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఆర్థ్ధికంగా ఎంతో నష్టపోతున్నారన్నారు.
ప్రభుత్వ వైద్య సేవలను పేదలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పేద ప్రజలు అధికంగా నివసించే బస్తీలలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు నగరంలో 164 బస్తీ దవాఖానలను ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రెండు బస్తీ దవాఖానలతో పాటు ఆరోగ్య కేంద్రాలను కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోనే ప్రారంభించినట్లు చెప్పారు. అదేవిధంగా మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ప్రతి మంగళవారం మహిళలకు వివిధ రకాల వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు, సలహాలు అందజేస్తారని చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వదిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు.
దివంగత ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సీబీఎన్ నగర్లో బస్తీ దవాఖానను ప్రారంభించిన అనంతరం స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, నాలాకు వచ్చే వరదతో ఏర్పడే ముంపు సమస్య పరిష్కారం వంటి అనేక కార్యక్రమాలు సాయన్న కృషితో జరిగాయన్నారు. సాయన్న లేకపోయినా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధ్దికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే కార్యక్రమాల కింద నిర్మించిన ఇండ్లు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయని, వాటి మరమ్మతులకు రూ.100 కోట్లను విడుదల చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారని చెప్పారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ సభ్యులు లోక్నాథం, పాండుయాదవ్, అనితాప్రభాకర్, నేతలు నివేదిత, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, తేజ్పాల్, ప్రవీణ్యాదవ్, దేవులపల్లి శ్రీనివాస్, పెద్దాల నర్సింహ, సాయికిరణ్, కుమార్ ముదిరాజ్, మురళీయాదవ్, సదానంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.