మన్సూరాబాద్, ఏప్రిల్ 20: జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మంగళవారం ఉదయం ఆకస్మిక పర్యటన చేశారు. శానిటేషన్తో పాటు ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆటోనగర్ పాత డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలతో పాటు ఎల్బీనగర్ రింగ్రోడ్డు నుంచి చింతలకుంట చెక్పోస్టు వరకు రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లను ఏర్పాటు చేసి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చేసిన పనులను మేయర్ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాల నుంచి నగరానికి వచ్చే ముఖ ద్వారం ప్రాంతమైన చింతలకుంట నుంచి ఎల్బీనగర్ వరకు చేపట్టిన సుందరీకరణ పనులను ఆమె ప్రశంసించారు.
ఆటోనగర్లోని తాత్కాలిక చెత్త సేకరణ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఎల్బీనగర్లోని వివిధ సర్కిళ్ల పరిధిలో నుంచి సేకరించిన చెత్తను ఆటోనగర్ పాత డంపింగ్ యార్డుకు తీసుకువచ్చి అక్కడి నుంచి జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విధానాన్ని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎల్బీనగర్లోని వివిధ సర్కిళ్ల పరిధి నుంచి సేకరించిన చెత్తను స్వచ్ఛ ఆటోల ద్వారా ఆటోనగర్కి తీసుకువచ్చి కంటైనర్లోకి మారుస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో చెత్తపడకుండా చూసుకోవాలని జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులకు సూచించారు.
ప్రతిరోజు ఉదయం 5 గంటల వరకు జీహెచ్ఎంసీ సిబ్బంది తమ పాయింట్ల వద్దకు చేరుకుని పారిశుధ్య పనులను చేపట్టాలని, పనులను అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డీసీ మారుతీదివాకర్, కార్పొరేటర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించి పారిశుధ్య సమస్యలను పరిశీలించారు.
పారిశుధ్య పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, ఎక్కడా అపరిశుభ్రత లేకుండా చూడాలని సూచించడంతో పాటుగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని ఆమె సూచించారు.
నాగోలు బ్రిడ్జి ప్రాంతంలో గ్రీనరీని, వర్టికల్ గార్డెన్ను ఆమె పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి , ఉప కమిషనర్లు హరి కృష్ణయ్య, సురేందర్రెడ్డి, మారుతీ దివాకర్లతో పాటుగా వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
లింగోజిగూడ డివిజన్లో చేపట్టిన బాక్స్టైప్ డ్రైన్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.
ఆమె ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, డీసీ సురేందర్రెడ్డితో కలిసి పనులను పరిశీలించారు.
అనంతరం పారిశుధ్య సిబ్బందితో మేయర్ మాట్లాడారు.
కార్యక్రమంలో మామిడి జగన్నాథ్రెడ్డి, ఉప్పల శ్రావణ్కుమార్గుప్తా, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
బీఎన్రెడ్డినగర్ డివిజన్లోని బతుకమ్మకుంట అభివృద్ధికి కృషిచేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అన్నారు.
మంగళవారం డివిజన్లో పర్యటించి బతుకమ్మకుంటను పరిశీలించారు.
చెరువులు, కుంటల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ఉన్నామన్నారు.
డివిజన్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి మేయర్కు వివరించారు.
ఈ కార్యక్రమంలో హయత్నగర్ డిప్యూటీ కమిషనర్ మారుతీదివాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.