బంజారాహిల్స్,డిసెంబర్ 21: జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఎన్నో సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఐటీ. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.
నోరూరించే రాజస్థానీ, గుజరాతీ సాంప్రదాయ వంటకాలనునగరవాసులకు అందించేందుకు జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో ‘రాజ్ తాలీ’ పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ను ఐటీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ నగరమంటే హెరిటేజ్తో పాటు మోడ్రన్ నగరాల మిశ్రమమని, భిన్న రూపాలు కలిగిన హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ఎన్నో సంస్థలు వచ్చాయని, మరిన్ని సంస్థలు కూడా తమ పెట్టుబడులకు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయన్నారు.
రెస్టారెంట్లో కేవలం రాజస్థానీ, గుజారాతీ రుచుల సమ్మేళనంలో 32 వంటకాలతో ఏర్పాటు చేసిన తాలీని అందుబాటులోకి తీసుకువచ్చామని నిర్వాహకులు సన్నీ తెలిపారు. రోజుకో కొత్త రుచితో తాలీని తయారు చేస్తామని పేర్కొన్నారు.
అసలైన రాజస్థానీ, గుజారాతీ వంటకాలను ఇష్టపడేవారికోసం ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేశామన్నారు. సాధారణ రోజుల్లో రూ.450కి తాలీ అందిస్తామని, మహిళల కోసం ప్రత్యేకంగా మంగళవారం రోజున 25శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపారు.