హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారులోని బాటసింగారం పండ్ల మార్కెట్కు మధురఫలం రాక మొదలైంది. రాళ్ల వానల కారణంగా పంట దిగుమతి ఆలస్యమైంది. బాటసింగారం మార్కెట్కు సోమవారం 1500-1600 టన్నుల మామిడి దిగుమతి అయినట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో మామిడి రూ.80-రూ.100కు లభిస్తున్నది. మార్కెట్కు దిగుమతులు పెరిగితే ధరలు కూడా తగ్గుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయిలో మామిడి సీజన్ ఈ నెల 20 తర్వాతే ప్రారంభమవుతుందని తెలిపారు. 19.27 ఎకరాల్లో మామిడి క్రయ, విక్రయాల కోసం అధికారులు ఏర్పాట్లుచేశారు. ఈ సీజన్లో ప్రతి రోజూ 900 నుంచి 1,100 వాహనాలు యార్డుకు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. యార్డు పక్కనే ఉన్న ఏడెకరాల స్థలాన్ని పార్కింగ్కు కేటాయించారు. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.