బేగంపేట్, ఆగస్టు 24: వివాహాది శుభాకార్యాల కోసం బంగారం, వెండి, వజ్ర ఆభరణాలకు ప్రత్యేక గుర్తింపు కలిగింది మానేపల్లి జువెల్లరీస్. నగరంలో మానేపల్లి జువెల్లరీస్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆభరణాలు తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నట్టు సంస్థ అధినేతలు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఆభరణాలు తయారు చేసి ఇవ్వడంతో పాటు వివిధ రకాల రెడీమేడ్ ఆభరణాలను కూడా అందిస్తున్నారు. సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాల్లో 6 బ్రాంచ్లను ఏర్పాటు చేసి నగర వాసులకు నాణ్యమైన బంగారు, వెండి ఆభరణాలు అందిస్తున్న విషయాన్ని వారు తెలిపారు.
రూ.500ల నుంచి వినియోగదారుల తాహత్తుకు తగ్గట్టుగా కోట్ల రూపాయల వరకు వివిధ రకాల అభరణాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. వివాహాలకు సంబంధించి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అందిస్తున్న ఏకైక సంస్థ మానేపల్లి జువెల్లరీస్. నాణ్యత విషయానికి వస్తే ప్రతి వస్తువుకు హెచ్ఐడీ నంబరింగ్తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలు సర్టిఫికెట్ కలిగి ఉంటాయి. ఇందులో తయారయ్యే డిజైన్లు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తయారు చేసి ఇవ్వనున్నారు.
ఇక్కడ రెడీమేడ్ వస్తువులతో పాటు వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఆర్డర్లపై ఆభరాణాలు తయారు చేసి ఇవ్వడం వీరి ప్రత్యేకత. వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా మానేపల్లి జువెల్లరీస్లో గోల్డ్ డిజిటల్ యాప్ను ప్రవేశ పెట్టినట్టు వారు వివరించారు. మొబైల్ ఫోన్ ఉంటే చాలు వినియోగదారులు వారికి అనుగుణంగా నచ్చిన రీతిలో ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు. డైమండ్ అండ్ జువెల్లరీస్పై 25 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించారు. అలాగే, బంగారు వెండి ఆభరణాల తయారీపై మేకింగ్ చార్జ్లపై 25 శాతం డిస్కౌంట్ ప్రకటించినట్టు మానేపల్లి మేనేజింగ్ డైరెక్టర్లు గోపీకృష్ణ, మురళీకృష్ణలు వెల్లడించారు.