వెంగళరావునగర్,జూన్ 26: జిమ్కు వస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అందిన ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ మహిళ(30) సనత్ నగర్లోని కల్ట్ జిమ్కు వస్తుండేది. ఈ క్రమంలో ఆమెకు శృతిక అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది.
జిమ్ ట్రైనర్లు నరేష్ నాయుడు, హరీష్, గోపీకృష్ణలతో కలిసి గ్రూప్ సెక్స్లో పాల్గొనాలంటూ శృతిక తనను వేధిస్తుండేదని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మరో సందర్భంలో జిమ్ భవనం నుంచి లిఫ్ట్లో వెళ్తున్న తనపై శృతిక, నరేష్ నాయుడు ఇద్దరూ అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో తెలిపింది. ఇటీవల హరీష్, గోపీకృష్ణ కూడా జిమ్ ఉన్న భవ నం బేస్మెంట్లో తన పట్ల దురుసుగా వ్యవహరించడంతో పాటు జుట్టు పట్టుకుని లాగారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శృతిక, నరేష్ నాయుడు, హరీష్, గోపీకృష్ణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.