కొండాపూర్, నవంబర్ 10: ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. చందానగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రోరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ కాలనీకి చెందిన జె.శ్రీనివాస్ (40) డ్రైవర్. గురువారం అతడు తన స్కూటీపై గచ్చిబౌలి వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది.
తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను గమనించిన స్థానికులు.. వెంటనే చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.