మైలార్దేవ్పల్లి : ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై గోపరాజు తెలిపిన వివరాల ప్రకారం శ్రీరామ్కాలనీకి చెందిన విష్ణు (27) జ్వోతి (25) భార్యాభర్తలు మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి ముగ్గురు సంతానం. తమ సొంత ఊరు నాగర్ కర్నూల్లో బంధువుల పెండ్లి ఉండడంతో ఊరికి వెళ్తానన్న భార్యను ఆరాంఘర్లో బస్సు ఎక్కించడానికి శ్రీరామ్నగర్ కాలనీ నుండి ఆరాంఘర్కు ద్విచక్రవాహనంపై బయలుదేరారు.
ఆరాంఘర్ నుండి వస్తున్న జీహెచ్ఎంసీ టిప్పర్ సూర్యదాబావద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ద్విచక్రవాహనం వేగంగా టిప్పర్ను డీకొట్టడంతో విష్ణు అక్కడికక్కడే మృతి చెందాడు. జ్యోతి తీవ్రగాయాలతో దవఖానలో చికిత్స పొందుతున్నది. భార్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు బందువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.