కేపీహెచ్బీ కాలనీ, జూన్ 19 : కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లోని హిందూ శ్మశానవాటికలో సకల వసతులు కల్పిస్తున్న కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శనివారం కాలనీ 7వ ఫేజ్లోని హిందూ శ్మశానవాటికను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హిందూ శ్మశాన వాటికను ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. హిందూ శ్మశానవాటికలో అధునాతన శ్మశానవాటికలు, విశ్రాంతి, పూజా గదులను నిర్మించినట్లు తెలిపారు. మరోవైపు ఆహ్లాదకరమైన పరిసరాలు ఉండేలా పచ్చని మొక్కలు, పూల మొక్కలు నాటి సంరక్షిస్తున్నట్లు తెలిపారు. అంతిమ ఘట్టంలో దహన సంస్కారాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీదేవి, ఏఈ సాయిప్రసాద్ తదితరులు ఉన్నారు.