కేపీహెచ్బీ కాలనీ, జూన్ 10 : కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా సాగుతున్నట్లు జడ్సీ మమత తెలిపారు. జోన్ పరిధిలోని మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లలో 242 బృందాలతో ఇంటింటికి జ్వరసర్వే చేస్తున్నట్లు తెలిపారు. గురువారం 15,826 ఇండ్లలో సర్వే చేయగా కరోనా లక్షణాలు కనిపించిన 31 మందికి మెడికల్ కిట్లను అందించినట్లు తెలిపారు.
సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే మూసాపేట సర్కిల్లో 4,363 ఇండ్లలో సర్వే చేయగా 10 మెడికల్ కిట్లు, కూకట్పల్లి సర్కిల్లో 3,039 ఇండ్లలో సర్వే చేయగా 9 మెడికల్ కిట్లు, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 3,524 ఇండ్లలో సర్వే చేయగా 5 మెడికల్ కిట్లు, గాజులరామారం సర్కిల్లో 2,437 ఇండ్లలో సర్వే చేయగా 6 మెడికల్ కిట్లు, అల్వాల్ సర్కిల్లో 2,468 ఇండ్లలో సర్వే చేయగా ఒక మెడికల్ కిట్ అందించినట్లు తెలిపారు.
వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా గురువారం జోన్లోని ఐదు సర్కిళ్లలో 6,496 మందికి కరోనా టీకాలు వేసినట్లు తెలిపారు. 18 నుంచి 44 సంవత్సరాల వయసు గల నిత్య సేవకులు 5,176 మందికి, 44 సంవత్సరాలు పైబడిన నిత్య సేవకులు 1,320 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే మూసాపేట సర్కిల్లో 1,418 మందికి, కూకట్పల్లి సర్కిల్లో 1,428 మందికి, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 1350 మందికి, గాజులరామారం సర్కిల్లో 1,078 మందికి, అల్వాల్ సర్కిల్లో 1,222 మందికి కరోనా టీకాలు వేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మొబైల్ యాప్ ద్వారా టోకెన్లను అందిస్తూ కరోనా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు.