నేరేడ్మెట్, డిసెంబర్ 8: మల్కాజిగిరి నియోజకవర్గంలోని ప్రతి కాలనీ సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నా రు. గురువారం వినాయకనగర్ డివిజన్ పరిధిలోని శివనగర్లో రూ.1.80 కోట్ల నిధులతో చేపట్టే బాక్స్ డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా వరదముంపునకు గురయ్యే కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని అన్నారు.
డివిజన్లోని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం స్థానికులు మాట్లాడు తూ.. ఎమ్మెల్యే మైనంపల్లి సహకారంతో డివిజన్ను మోడల్గా తీర్చిదిద్దుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ సత్యలక్ష్మి, పిట్టల శ్రీనివాస్, జీఎన్వీ సతీశ్ కుమార్, గుండా నిరంజన్, సూరి, ఫరీద్, ప్రభాకర్ రెడ్డి, బాలకృష్ణ, సంతోశ్రాందాస్, మోహన్రెడ్డి, పేపర్ శ్రీనివాస్, భాస్కర్, ధరణికుమార్, అంజయ్య, మల్లికార్జున్, అనసూయ, చారి, రాంచందర్, సత్యనారాయణ, శ్రీనివాస్ గుప్తా, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, అండాలు, హోలిమా, తదితరులు పాల్గొన్నారు.