Malakpet Mureder Case | అప్పు ఇచ్చిన మహిళనే ఓ వ్యక్తి దారుణంగా తలనరికి, శరీర భాగాలను ఇంట్లోని ఫ్రిజ్లో దాచి పెట్టాడో ఘనుడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ చైతన్యపురిలో చోటు చేసుకున్నది. సదరు నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గత ఆరు రోజుల కింద మలక్పేట మూసీ పరీవాహక ప్రాంతమైన తీగలగూడ వద్ద ప్లాస్టిక్ కవర్లో మహిళ తల కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంపై కేసులో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా.. మృతురాలి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. మహిళ తలతో పోస్టర్లను ముద్రించి.. వీధుల్లో తిరుగుతూ ఆచూకీ కోసం ఆరా తీశారు. పోలీసులు మలక్పేట, సైదాబాద్, చాదర్ఘాట్, పాతబస్తీతో పలుచోట్ల పోస్టర్లను చూపిస్తూ ఆరా తీశారు. ఆ క్రమంలోనే సదరు మహిళను నర్సుగా పని చేస్తున్న ఎర్రం అనురాధగా గుర్తించారు. మృతురాలి సోదరితో పాటు బావ తల అనురాధగా గుర్తించారు. మృతురాలు, వడ్డీ వ్యాపారం చేస్తుందని, డబ్బు విషయంలోనే హత్యకు గురైనట్లు ఆమె సోదరి తెలిపారు.
ఈ క్రమంలో నిందితుడి చంద్రమౌళిని పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో దాచినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ క్రమంలో చైతన్యపురిలోని నిందితుడి ఇంటికి వెళ్లి పరిశీలించగా.. దిగ్భ్రాంతికి గురయ్యారు. అనురాధ శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి కాళ్లను నిందితుడు ఫ్రిజ్లో దాచారు. మిగతా శరీర భాగాలను బకెట్లో దాచాడు. మృతురాలి శరీర భాగాలను ఉస్మానియా ఆసుప్రతికి తరలించారు.
అయితే, నిందితుడు చంద్రమోహన్ ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా అప్పులపాలయ్యాడు. దాంతో వడ్డీ వ్యాపారం చేసే అనురాధ వద్ద రూ.18లక్షల వరకు అప్పు చేశాడు. చంద్రమౌళి ఉంటున్న ఇంట్లోనే అనురాధ అద్దెకు ఉంటున్నది. అయితే, ఇటీవల డబ్బుల వ్యవహారంలో తరుచూ గొడవలు జరిగాయి. ఈ క్రమంలో గొడవలు ఎక్కువ కావడంతో అనురాధను పథకం ప్రకారం హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తలను కవర్లో పెట్టి మలక్పేట వద్ద పడేయగా.. శరీర భాగాలను ముక్కలుగా చేసి ఇంట్లోనే దాచాడు. హత్యకు కత్తి, టైల్స్, కట్టర్ను వాడినట్లుగా పోలీసులు గుర్తించారు.