సిటీబ్యూరో, మే 25, (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరిగేలా కౌంటింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా శనివారం బంజారాహిల్స్లోని కొమర్రం భీమ్ భవనంలో మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్స్, ఏఆర్ఓలకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రొనాల్డ్ రాస్ మాట్లాడుతూ జిల్లాలో ఓట్ల లెకింపునకు మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెకింపు పకాగా జరిగేలా పర్యవేక్షణ ఉంటుందని, కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, నిర్ణీత సమయానికి ఓట్ల లెకింపు ప్రారంభించాలన్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అన్ని సెగ్మెంట్లలో ఓట్ల లెకింపునకు ప్రతి హాల్లో 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నామని, రౌండ్ల వారీగా కౌంటింగ్ జరుగుతుందని వెల్లడించారు. ప్రతి టేబుల్కు ఓ మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ జాయింట్ సీఈవో, అడిషనల్ కమిషనర్ (యూబీడీ) జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సునందరాణి పాల్గొన్నారు.