ఉప్పల్, జూలై 15 : ప్రజల కోసం పనిచేయడానికి నిరంతరం సిద్ధంగా ఉన్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సు భాష్రెడ్డి అన్నారు. ‘మీ కోసం మీ ఎమ్మెల్యే’ పాదయాత్రలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర శనివారం 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉప్పల్ డివిజన్లోని కుమ్మరిబస్తీ, చాకలిబస్తీ, మాలబస్తీ, భరత్నగర్, న్యూభరత్నగర్, శ్రీరామకాలనీ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ కాలనీవాసుల నుంచి సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఉప్పల్ను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సమస్యలు లేకుండా తగిన పరిష్కార చర్యలు చేపడుతామన్నారు. ఉప్పల్లోని బస్తీవాసుల సమస్యలను గుర్తించామని, త్వరలోనే పరిష్కరి స్తామన్నారు. అనంతరం అధికారులతో సమస్యలపై ముదిరాజ్ భవన్లో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, అరిటికాయల భాస్కర్ ముదిరాజ్, లేతాకుల రఘుపతిరెడ్డి, బీఎస్ఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు బేతి సుమంత్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, గరిక సుధాకర్, మేకల మధుసూదన్రెడ్డి, చింతల నర్సింహారెడ్డి, కాటేపల్లి రవీందర్రెడ్డి, బేతాళ బాలరాజు, శైలేష్రెడ్డి, కాసం మహిపాల్రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, పల్లా కిరణ్కుమార్రెడ్డి, పల్లె నర్సింగ్రావు, డా.బీవీ చారి, ఈగ సంతోష్, పిల్లి నాగరాజు, జహంగీర్, యాదిరెడ్డి, వెంకట్రెడ్డి, అన్య వెంకటేశ్, స్వీట్హౌజ్ రాజు, వీరేశ్, సత్యపాల్రెడ్డి, మైసయ్య, అరిటికాయల వంశీ ముదిరాజ్, భరత్రెడ్డి, ఐలేశ్, శ్రీకాంత్, అం జయ్య, పంగ మహేందర్రెడ్డి, సాయి, రాణిరెడ్డి, అనితారెడ్డి, హేమలత, శ్యామల, నిర్మల, నజీమా పాల్గొన్నారు.
సమస్యల గుర్తింపు… పరిష్కారానికి చర్యలు
ఉప్పల్ డివిజన్లోని చాకలిబస్తీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, బంచ్కేబుల్, కుమ్మరి సంఘానికి బోర్వెల్ మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ ఏర్పా టు, మ్యాన్హాల్ సమస్యలు గుర్తించారు. అదేవిధంగా భరత్నగర్లో బోర్వెల్ రిపేర్, మ్యాన్హా ల్ నిర్మాణం, యూజీడీ, సీసీ రోడ్లు, వీధిదీపాలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేశా రు. తారునీరు, లోఫ్రెషర్, కలుషితనీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆసరా పెన్షన్లు, మహిళా భవనం, కాలనీల్లో మౌలి క వసతుల కల్పనకు కృషి చేయాలని కోరారు.