చాదర్ఘాట్ : మార్షల్ ఆర్ట్స్లోని కరాటే, జూడో, తైక్వాండో, కుంగ్-ఫు తదితర ఆటల్లో ప్రావీణ్యం సాధిస్తున్న క్రీడాకారు లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని థాయి బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సుమన్ తల్వార్ అన్నారు.
వచ్చే నెల 3 నుంచి ఏషియన్ థాయి బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలను సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తు న్నట్లు ఆయన తెలిపారు. సోమవారం మలక్పేట లోని పాకో మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో థాయిబాక్సింగ్ ఏషియన్ చాంపియన్షిప్ పోటీల వివరాలను డాక్టర్ సుమన్, ప్రధాన కార్యదర్శి ఇప్తేకార్ స్సేన్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుమన్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్లో రాణిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తే ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను వ్యాపించే విధంగా చేస్తారన్నారు. మార్షల్ ఆర్ట్స్ ను స్కూల్, కాలేజీలో తప్పనిసరిగా అమలు చేసే విధంగా చూడాలన్నారు. తద్వారా విద్యార్థి, విద్యార్థినుల్లో మానసిక స్థెర్యం పెరగడం తో పాటు భౌతిక, మానసిక దృడత్వానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ పోటీల్లో ఆసియా ఖండంలోని 12 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. క్రీడాకారులకు కావల్సిన అన్ని సదుపాయాలు, రవాణ, వసతి సౌకర్యాలు తదితర ఏర్పాట్లన్ని పూర్తి చేశామన్నారు.