బన్సీలాల్పేట్, డిసెంబర్ 21 : వివిధ దేశాల్లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ర్టాలకు కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసిందని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు.
చైనా, జపాన్, బ్రెజిల్, యూఎస్ఏ, కొరియా లాంటి పలు దేశాల్లో మరోసారి కరోనా పంజా విసురుతున్నదని, మళ్లీ వైరస్ దాడి చేసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు. కిడ్నీ, ఆస్తమా, లివర్, క్యాన్సర్, హృద్రోగులు, దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉన్నవారు ముందుగా వైరస్ బారిన పడే అవకాశం ఉన్నదని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు.