ఎల్బీనగర్, ఏప్రిల్ 4 : హనుమాన్ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించే హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో హనుమాన్ జయంతి ర్యాలీ వాల్పోస్టర్ను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం ఎల్బీనగర్ వైపు చూసేలా భారీగా హనుమాన్ శోభాయాత్రను నిర్వహిస్తామన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం సాయంత్రం 3 గంటలకు సరూర్గర్ ఇండోర్ స్టేడియం వద్ద హనుమాన్ శోభాయాత్ర ప్రారంభించి సాయంత్రం కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం వద్ద శోభాయాత్రను ముగిస్తామన్నారు. ఈ శోభాయాత్రను 11 డివిజన్లకు చెందిన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. సరూర్నగర్ ఇండోర్స్టేడియం వద్ద సాయంత్రం 3 గంటలకు శోభాయాత్ర ర్యాలీ ప్రారంభం అవుతుందని, అక్కడి నుంచి వనస్థలిపురం చౌరస్తా, ఎన్జీవోస్ కాలనీ చౌరస్తా, బీఎన్రెడ్డినగర్ చౌరస్తా, హస్తినాపురం చౌరస్తా, సాగర్ రింగ్రోడ్డు మీదుగా బైరామల్గూడ, చంపాపేట గాంధీబొమ్మ చౌరస్తా నుంచి కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీని పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్, మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాస్రావు, కొప్పుల విఠల్రెడ్డి, వజీర్ ప్రకాశ్గౌడ్, సామ తిరుమల్రెడ్డి, భవానీప్రవీణ్, జిట్టా రాజశేఖర్రెడ్డి, డివిజన్ల అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్రెడ్డి, చింతల రవికుమార్, జక్కిడి మల్లారెడ్డి, సత్యం చారి, జక్కల శ్రీశైలం యాదవ్, వరప్రసాద్రెడ్డి, తోట మహేశ్యాదవ్, రాజిరెడ్డి, బబ్బురి ఆనంద గౌడ్, అనంతుల రాజారెడ్డి, మహిళా అధ్యక్షురాళ్లు ధనలక్ష్మి, ఆదిలక్ష్మి, నాగలక్ష్మి, మల్లికారెడ్డి, శ్వేతారెడ్డి, అంజలి, రోజారెడ్డి, సువర్ణరెడ్డి, లక్ష్మీప్రసన్న, ప్రమీలతో పాటు పార్టీ నాయకులు, ప్రముఖులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి తాడ్బంద్ హనుమాన్ దేవాలయం వరకు నిర్వహించే శోభాయాత్రను జయప్రదం చేయాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, సంయుక్త కార్యదర్శి రావినూతల శశిధర్ కోరారు. మంగళవారం సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్పై భవాని దేవాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. హనుమాన్ శోభాయాత్రను నిర్వహించేందుకు హిందూ బంధువులంతా ఐకమత్యంతో ముందుకు రావాలన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు కర్మన్ఘాట్ హనుమాన్ దేవాయలం నుంచి శోభాయాత్ర బయలుదేరి కోఠిలోని యాత్రతో జతకలిసి తాడ్బంద్ హనుమాన్ దేవాలయం వరకు యాత్ర సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ ప్రతినిధులు రవీందర్రెడ్డి, నిరంజన్ యాదవ్, బ్రహ్మచారి, రాంరెడ్డి, రాఘవ, పవన్కుమార్, వెంకన్న, గంగం నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హన్మాన్ యువసేన ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు యువసేన అధ్యక్షుడు బొల్గం యశ్పాల్గౌడ్ అన్నారు. మోహన్నగర్లో హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా మోహనగర్ బాలాజీ కాలనీ నుంచి చైతన్యపురి ఇందిరానగర్ రామాలయం వరకు గురువారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యువసేన ప్రతినిధులు సంప్రీత్, అవినాశ్, సాయినాథ్ గౌడ్, కిరణ్కుమార్, కులకర్ణి, తరుణ్సింగ్, గౌరవ్షా, చింటూ తదితరులు పాల్గొన్నారు.