నాంపల్లి కోర్టులు: రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై జరిగిన దాడికి (Attack on Woman Judge) నిరసనగా నాంపల్లి కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు. మహిళా జడ్జి పై జరిగిన దాడి న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించి సంఘీభావం తెలిపిన న్యాయవాదులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజ్యవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. బార్కు బెంచ్కు మధ్యా మంచి సంబంధాలున్నాయని, దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించేలా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి లడ్డ, ఉపాధ్యక్షులు గోకుల్, సభ్యులు, న్యాయ వాదులు రామనగౌడ్, డి. అనంత రఘు, తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా న్యాయమూర్తిపై నిందితుడు గురువారం పాదరక్ష విసిరిన సంగతి తెలిసిందే. హత్యాయత్నం, మారాణాయుధాల కేసులో నిందితుడు కరణ్సింగ్ విచారణ సమయంలో హఠాత్తుగా చెప్పు తీసి న్యాయమూర్తిపై విసిరాడు. ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన సిబ్బంది, న్యాయవాదులు అతన్ని పట్టుకొని చితకబాదారు.