సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను హైదరాబాద్లో అందుబాటులోకి తీసుకువస్తున్నామని, వచ్చే 6 నెలల్లో 25 నుంచి 30 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, టీఎస్ఆర్టీసీలకు మంత్రి కేటీఆర్ సూచించారు.