శ్రీనగర్కాలనీ, ఆగస్టు 16 : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు బస్తీల్లో ముమ్మరంగా కొవిడ్ టీకాలను ఇస్తున్నారు. వేంకటేశ్వర కాలనీ డివిజన్లో దేవరకొండ బస్తీ సోమవారం కొవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే సింగాడికుంట, జహీర్నగర్, ఇబ్రహీంనగర్ బస్తీల్లో కొవిడ్ మొబైల్ వ్యాక్సినేషన్లో భాగంగా బస్తీవాసులకు టీకాలను వైద్యాశాఖ సిబ్బంది వేశారు. డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాల్లో టీకాలు వేయనున్నట్లు వైద్యసిబ్బంది తెలిపారు.