సుల్తాన్బజార్, జూన్ 19: కోఠి ఈఎన్టీకి స్వచ్ఛంద సంస్థలు చేయూత అందించడం అభినందనీయమని ఆ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తాటి శంకర్ అన్నారు. శనివారం గాంధీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (అలుమ్నీ అసోసియేన్) సభ్యులు డాక్టర్ ప్రతాప్రెడ్డి, డాక్టర్ లింగమూర్తి, డాక్టర్ నందకుమార్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి రూ.9 లక్షల విలువైన 15 డి బ్రైడర్ బ్లేడ్లను సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్కు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఈఎన్టీ దవాఖాన హెచ్వోడి ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.సుదర్శన్రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ ఆచార్య, ప్రొఫెసర్ డాక్టర్ సంపత్కుమార్,అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రవిశంకర్,లయన్స్ క్లబ్ సభ్యులు హర్భిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.