పహాడీషరీఫ్లో స్థలాన్ని పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
వ్యాపారుల అభ్యర్థన మేరకు స్థలాన్ని పరిశీలించాం
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పహాడీషరీఫ్, మార్చి 29: కొత్తపేట పండ్ల మార్కెట్ను తాత్కాలికంగా పహాడీషరీఫ్లో ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు కొత్తపేట పండ్ల మార్కెట్ను తాత్కాలికంగా పహాడీషరీఫ్లో ఏర్పాటుకు సంబంధించి మంగళవారం మంత్రి నిరంజన్రెడ్డి నివాసంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ బలాల కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పహాడీషరీఫ్లోని వక్ఫ్ బోర్డుకు సంబంధించి సర్వే నంబర్ 90లో ఉన్న స్థలాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్అలీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ బలాల పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కొత్తపేట పండ్ల మార్కెట్ను తొలుత కొహెడకు తరలించారు.. ఆ తర్వాత బాటసింగారానికి తరలించారు.. ఈ రెండు ప్రాంతాలు దూరంగా ఉన్నాయంటూ వ్యాపారస్తుల అభ్యర్థన మేరకు మంగళవారం స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. పహాడీషరీఫ్లో ఏర్పాటుపై సమాలోచన చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బాలాపూర్ తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, టీఆర్ఎస్ నాయకులు యూసుఫ్ పటేల్, వాసుబాబు, బర్కత్అలీ, కౌన్సిలర్లు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.