Hyderabad CP | హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ ముఠాలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ ముఠాలు ప్యాకప్ చేసుకుని వెళ్లిపోవాలని ఆదేశించారు.
పార్టీల పేరుతో డ్రగ్స్ సరఫరా చేస్తే వదిలేది లేదని కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. డ్రగ్స్ ముఠాలు ప్యాకప్ చేసుకుని వెళ్లిపోవాలని ఆదేశించారు. డ్రగ్స్ సరఫరా చేసేవారికి హైదరాబాద్లో చోటు లేదని పేర్కొన్నారు. పార్టీల పేరుతో డ్రగ్స్ సరఫరా చేస్తే వదిలేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్స్, రెస్టారెంట్లు, ఫామ్హౌజ్ యజమాన్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని గౌరవించే వారితోనే ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉంటుందని సీపీ తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారితో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా నేరాలు చేసేవారితో కరకుగా ఉంటామని అన్నారు.
కొత్తకోట శ్రీనివాస్రెడ్డి నేపథ్యం ఇదీ..!
☛ 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన కొత్తకోట శ్రీనివాస్రెడ్డి ఎక్కడ పనిచేసినా అక్కడ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. సిన్సియర్ అధికారిగా ఆయనకు పేరుంది. అత్యధికంగా బదిలీ అయ్యే ఐపీఎస్ అధికారుల్లో శ్రీనివాస్రెడ్డి ఒకరు అనే పేరుంది.
☛ నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా మొదటి పోస్టింగ్ పొందారు. ఆ తరువాత కామారెడ్డి, మెదక్, 8వ బెటాలియన్ కమాండెంట్, 2000 నుంచి 2002 వరకు నెల్లూరు ఎస్పీగా పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ డీసీపీగా పనిచేశారు. వరంగల్ ఎస్పీ, గ్రే హౌండ్స్ కమాండర్, మహబూబ్నగర్ ఎస్పీ, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. హైదరాబాద్ రేంజ్ డీఐజీగా, ఏసీబీ అదనపు డైరెక్టర్గా విధులు నిర్వహించారు. 2012 నుంచి 2014 వరకు వైజాగ్లో కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఐజీగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐజీ ట్రైనింగ్ అండ్ లీగల్, గ్రేహౌండ్స్, అక్టోపస్ ఐజీగా పనిచేశారు. ఈ ఏడాది జనవరి నెలలో అదనపు డీజీగా పదోన్నతి పొందడంతో ఆయనకు అదనపు డీజీ ఆర్గనైజేషన్ అండ్ లీగల్ బాధ్యతలను అప్పగించారు. తాజాగా.. హైదరాబాద్ సీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
☛ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పనిచేశారు. మహబూబ్నగర్ ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో మావోయిస్టులకు సంబంధించిన రాకెట్ లాంచర్లను గుర్తించి పట్టుకున్నారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. నెల్లూరులో పనిచేస్తున్న సమయంలో క్రిమినల్స్ గ్యాంగ్పై ఉక్కుపాదం మోపారు. ఏసీబీలో పనిచేస్తున్న సమయంలో లిక్కర్ సిండికేట్ మాఫియాతో ఊచలు లెక్కించేలా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీస్ రిక్రూట్మెంట్లో 12,000 మందికి శిక్షణ ఇచ్చారు. యూనియన్ హోం మినిస్టర్ నుంచి 2021లో ఉత్తమ శిక్షణా అవార్డును స్వీకరించారు. గ్రే హౌండ్స్కు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న 143 ఎకరాలకు సంబంధించిన కేసును పకడ్బందీగా ఆధారాలతో సుప్రీం కోర్టులో గెలిచే విధంగా చేయడంలో ఆయన తనవంతు పాత్ర పోషించారు.
☛ శ్రీనివాస్రెడ్డి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2010లో ఇండియన్ పోలీస్ మెడల్ను, 2019లో ప్రెసిండెన్సియల్ పోలీస్ మెడల్, 2023లో అతి ఉత్కర్షిత్ సేవా పతకం అవార్డును స్వీకరించి.. బెస్ట్ పోలీస్ అధికారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అహ్మదాబాద్ ఐఐఎంలో నిర్వహించిన చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ కోర్సు, యూకే కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఐపీఎస్ ఆఫీసర్స్ మిడ్టర్మ్ కోర్సు, యాంటీ టెర్రరిజం అసిస్టెన్స్ (ఏటీఏ) కోర్సును హంగేరీలోని ఇంటర్నేషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ అకాడమీలో చేశారు.