మెహిదీపట్నం : మాంసం దుకాణం నిర్వాహకుడిపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచిన సంఘటన హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహిదీపట్నంలో సోమవారం కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….షేక్పేట్కు చెందిన మహబూబ్ ఖురేషీ (35) మెహిదీపట్నం అజీజియా మసీద్ సమీపంలో రెండు రోజుల క్రితం నూతనంగా మాంసం దుకాణం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా ఆ దుకాణం భవన యజమానికి, అంతకు ముందు అక్కడ దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తికి గొడవలు జరిగాయి.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఓ వ్యక్తి మహబూబ్ ఖురేషీ వద్దకు వచ్చి అతడిపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచి పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.కేసు దర్యాప్తులో ఉంది.