కాచిగూడ, ఆగస్టు 23 : తెలంగాణ పోలీస్ వ్యవస్థ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉందని కేంద్ర పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. నిజాం నవాబు కాలంలో నిర్మించిన కాచిగూడ పోలీస్స్టేషన్ శిథిలావస్థకు చేరుకోవడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం రూ.4.50 కోట్ల వ్యయంతో 3 అంతస్తులతో ఆధునిక హంగులతో నిర్మించిన పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని సోమవారం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ సురభివాణీదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ మహేందర్రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్రెడ్డి, అడిషనల్ డీసీపీలు మురళీధర్, అనిల్కుమార్తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఇన్స్పెక్టర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఎస్సైల రూమ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం దేశానికే సవాల్ విసురుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కలిస్తూ వారిని భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతి బస్తీ పౌరుడిని ఒక పోలీస్గా తయారు చేసి నేరాలను నియంత్రిచేలా కృషిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రూ.67వేల కోట్లతో పోలీసు వ్యవస్థను ఆధునీకరించిదని అన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత రూ.700 కోట్లతో పోలీసు శాఖలో ఆధునిక వాహనాల సదుపాయాలు కల్పించామన్నారు. శాంతి భద్రతల్లో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ డయల్ 100తో ప్రజలు పోలీసులకు మరింతగా దగ్గరయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్, వెంకటరమణ, కాచిగూడ సీఐ హబీబుల్లాఖాన్, డీఐ యాదేందర్, ఎస్సైలు శ్రీనివాస్, లక్ష్మయ్య, నాగార్జునరెడ్డితో పాటు కార్పొరేటర్లు ఉమాదేవి, దూసరిలావణ్య శ్రీనివాస్గౌడ్, అమృత, మాజీ ఫ్లోర్లీడర్ దిడ్డి రాంబాబు, డాక్టర్.ఎన్ గౌతం రావు, కన్నె రమేశ్యాదవ్, దూసరి శ్రీనివాస్గౌడ్, ఓంప్రకాశ్యాదవ్, బి.కృష్ణాగౌడ్, సునిల్ బిట్లాని, ప్రదీప్రావు, నందకిశోర్యాదవ్, విజితారెడ్డి, తుమ్మల నరసింహారెడ్డి, క్షీరసాగర్, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.