బంజారాహిల్స్, అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీకే అధికారం దక్కనుందని అన్ని సర్వేల్లో స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయని, ఖైరతాబాద్ నియోజకవర్గంలోనూ భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీదే విజయమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.46లోని అంబేద్కర్కాలనీలో ఆదివారం పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులతో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా తొమ్మిదిన్నర ఏళ్లపాటు పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత మామిడి నర్సింగరావు , అంబేద్కర్ కాలనీ అధ్యక్షుడు గద్దల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి ఎం.మధుసూదన్, ఉపాధ్యక్షుడు శ్రీను, అందె వెంకన్న పాల్గొన్నారు.