‘సేవ్ కేబీఆర్’ పేరుతో బీఆర్ఎస్ యువజన విభాగం, వాకర్లు శనివారం నిరసన చేపట్టారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, పర్యావరణాన్ని దెబ్బతీస్తూ వందలాది చెట్లను నరికివేయడం దారుణమని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి అన్నారు. వెంటనే హెచ్సిటీ ప్రాజెక్టును నిలిపివేసి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.
– బంజారాహిల్స్
బంజారాహిల్స్, మే 9: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ పర్యావరణాన్ని దెబ్బతీసేలా చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్ట్పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ యువజన విభాగంతో పాటు వాకర్లు ‘సేవ్ కేబీఆర్’ పేరుతో చేపట్టిన ప్రదర్శనలో మన్నె గోవర్ధన్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. సుమారు మూడు దశాబ్దాలుగా కేబీఆర్ పార్కు చుట్టూ పచ్చదనాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వాలు కృషి చేశాయని, పార్కు చుట్టూ భారీ వృక్షాలు పెరిగి నగరవాసులకు ఆక్సిజన్ అందిస్తున్నాయన్నారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, పర్యావరణాన్ని దెబ్బతీస్తూ వందలాది చెట్లను నరికివేయడం దారుణమన్నారు. వెంటనే హెచ్సిటీ ప్రాజెక్టును ఆపేసి పర్యావరణ పరిరక్షణకు సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.