సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కార్తిక మాసం చివరి ఆదివారం కావడంతో నగరంలో వనభోజనాల సందడి కనిపించింది. కుటుంబసమేతంగా దగ్గరలోని ఆధ్యాత్మిక కేంద్రాలు, ఉద్యానవనాలకు తరలివెళ్లి.. పసైందన వంటకాలతో వన భోజనాలు చేసి.. ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు హైదరాబాదీలు. ఇందిరాపార్కులో వన భోజనాలు చేస్తున్న దృశ్యమిది.
కార్తిక మాసం చివరి ఆదివారం కావడంతో నగరంలో వన భోజనాల సందడి కనిపించింది. కుటుంబ సమేతంగా వనభోజనాలు చేస్తూ నగరవాసులు సందడి చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ సంతోషాన్ని పంచుకున్నారు. నగరంలో ఆలయాలన్నీ కార్తిక మాసం శోభతో వెలుగులీనాయి. పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దగ్గరలో ఉన్న వనాలకు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లారు.