బంజారాహిల్స్/శంషాబాద్ రూరల్/వెంగళరావునగర్, జూలై 12: సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు తన జన్మదిన వేడుకలను మధురానగర్లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన స్టేట్హోం, బాలసదనం, శిశువిహార్లలో ఆశ్రయం పొందుతున్న పిల్లలు, అవిభక్త కవలలు వీణావాణిల మధ్య ఘనంగా జరుపుకున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నం.14లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో హిమాన్షు పాల్గొన్నారు. హిమాన్షు తన తల్లి శైలిమాతో కలిసి జూబ్లీహిల్స్లోని పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. శంషాబాద్ మండలంలోని పెద్దతూప్ర మరియాసాధన్ వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, టి.ప్రకాశ్ గౌడ్, తఎంపీపీలు, జడ్పీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.