అంబర్పేట, మే 31: అంబర్పేట నియోజకవర్గంలో ఉన్న పార్కులను రూ.2.98కోట్లతో సుందరీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. పార్కులను సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పార్కుల అభివృద్ధిలో భాగంగా సోమవారం డైరెక్టర్ రాజశేఖర్, సర్కిల్ మేనేజర్ సత్యనారాయణమ్మ, జీహెచ్ఎంసీ సర్కిల్ ఈఈ శంకర్తో కలిసి బాగ్అంబర్పేట డివిజన్లోని వైభవ్నగర్ కాలనీ పార్కు, ఎస్బీఐ కాలనీ, రామకృష్ణ నగర్, ఇంద్రప్రస్థ కాలనీ, వాంబే కాలనీ పార్కులను సందర్శించారు. పార్కుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను స్థానిక కాలనీ వాసులతో పాటు అధికారులతో చర్చించారు. ప్రధానంగా వృద్ధులు, మహిలళు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయడం, వాకింగ్ ట్రాక్లు నెలకొల్పడం, టైల్స్, పెయింటింగ్ వేయడం, వివిధ రకాల మొక్కలను నాటడం, పార్కుల చుట్టూ ప్రహరీ గోడను నిర్మించి గేటు ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలను చర్చించారు.
పార్కు నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక వాచ్మన్ను ఏర్పాటు చేసే విషయాన్ని కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఉన్న పార్కులను స్థానికుల అభిప్రాయం మేరకు తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విక్రంనగర్ పార్కు ఒక్కదాన్నే రూ.కోటి వ్యయంతో అత్యాధునిక వసతులతో కూడిన పార్కుగా తయారు చేస్తున్నామని తెలిపారు. బర్కత్పుర హౌసింగ్ బోర్డు కాలనీ పార్కు, నల్లకుంటలోని పార్కులు, గోల్నాక డివిజన్లోని పార్కులన్నింటిని అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ రవి, స్థానిక నాయకులు మధుసూదన్రెడ్డి, హేమంత్, రవి, మహేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.