బోడుప్పల్, జూలై19: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దళితులకు న్యాయం జరిగిందని కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం బోడుప్పల్ నగరపాలక సంస్థ 3వ డివిజన్ పరిధిలో కృష్ణానగర్, వెంకటసాయినగర్ కాలనీలో రూ.33.50లక్షల నిధులతో నిర్మించే భూగర్భడైనేజీ పనులకు, 24వ డివిజన్ పరిధిలోని వీరారెడ్డినగర్ చౌరస్తా నుంచి అంబేద్కర్నగర్ వరకు రూ.40లక్షల నిధులతో నిర్మించే సీసీరోడ్డు పనులకు మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు చందర్గౌడ్, రమావెంకటేశ్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు.
పెద్ద కంచె సమస్యను పరిష్కరించిన ఘనత కేసీఆర్దే..
ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన బోడుప్పల్ పెద్దకంచె సమస్యను పరిష్కరించిన ఘనత సీఎంకేసీఆర్, మంత్రి కేటీఆర్కు దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దళితులకు చెందిన 360 ఎకరాల వ్యవసాయ భూమిని ల్యాండ్ఫూలింగ్ కింద అభివృద్ధి చేసి నగరశివారులో మరో అద్భుతాన్ని ప్రభుత్వం సృష్టించబోతుందని, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం తన హయాంలో, తన చేతులమీదుగా జరగడం సంతోషంగా ఉందని అన్నారు. దళితుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దళితబంధును తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగును నింపారని కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ కాకతీయ, భగీరథ, ఆసరా లాంటి పథకాలు అమలు చేసి మాట్లాడాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, కార్పొరేటర్లు జంగయ్యయాదవ్,ఎస్. పద్మారెడ్డి. సుమన్నాయక్, చీరాల నర్సింహ, కోఆప్షన్ సభ్యులు రంగ బ్రహ్మన్న, పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాలకృష్ణ, నాయకులు రాంచంద్రారెడ్డి, రవిగౌడ్, వెంకటేశ్,జంగారెడ్డి, కృపాసాగర్,చక్రపాణిగౌడ్, రాములు , రాజు,అధికారులు పాల్గొన్నారు.