కీసర, సెప్టెంబర్ 23 : గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కనుమరుగవడం ఖాయమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని భోగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రొండ్ల యాదగిరి, కృష్ణ, ప్రవీణ్, మల్కాజిగిరి భిక్షపతి, పెంటయ్య, ముదుగుల నర్సింహ, మహేశ్, కాటి భిక్షపతి, కుమార్, కాటుల సాయిలతో పాటు పలువురు శుక్రవారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ పేరును సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన నేపథ్యంలో మంత్రి సమక్షంలో పార్టీలో చేరుతున్నామని నాయకులు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులకు మంత్రి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటేశ్, మండల పార్టీ అధ్యక్షుడు జె. సుధాకర్రెడ్డి, మేడ్చల్ మార్కెట్ డైరెక్టర్ సత్యనారాయణ, భోగారం కో-ఆప్షన్ సభ్యులు నర్సింహా రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వెంకట్రాంరెడ్డి, నర్సింహా రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీరాములు, ప్రభాకర్రెడ్డి, భూపాల్, శివ, పరుశురాం, నర్సింగ్, శ్రీను పలువురు పాల్గొన్నారు.