సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 7: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-సెర్ఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో జ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ మేళాలో మహీంద్ర అండ్ మహీంద్ర అటోమోటీవ్ డివిజన్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
అప్రెంటిషిప్ హోదాలో టెన్త్ పాసైన మహిళలకు మాత్రమే రూ. 12,500, ఐటీఐ అన్ని ట్రేడ్లకు సంబంధించి అప్రెంటిషిప్ పోస్టులకు మహిళలకు మాత్రమే రూ.14,400 వేతనం ఉంటుందన్నారు. ఇంటర్ చేసిన మహిళలు, పురుషులకు అప్రెంటిషిప్ హోదాలో రూ. 14,400 కనీస వేతనం ఇవ్వనున్నట్లు వివరించారు. ఆయా అన్ని పోస్టులకు వయస్సు 18 ఏండ్ల నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలన్నారు. జాబ్మేళాకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ధ్రువ పత్రాలతో హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.