సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): నవంబర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ)తనిఖీలు నిర్వహించి, 6824 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచగా న్యాయస్థానం 93 మందికి జైలు శిక్ష, మిగిలిన వారికి రూ.2.37 కోట్ల జరిమానా విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్లడించారు.
పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి, మద్యం మత్తులో వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేయడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గినట్లు ఆయన తెలిపారు.