అమీన్పూర్ : ఐలాపూర్లోని భూముల లెక్క తేలనున్నది. ప్రభుత్వ భూమిలో చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలను భారీ స్థాయిలో హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన సంచలనం రేపింది. స్పందించిన ప్రభుత్వం పలు శాఖల అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇందులో సీసీఎల్ఏ కమిషనర్ చైర్మన్గా ,మెట్రోపాలిటిన్, సర్వే శాఖల కమిషనర్లు, రిజిస్ట్రేషన్ శాఖ, న్యాయశాఖ కార్యదర్శులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఉత్వర్వులు వెలువడిన నాటి నుంచి 8 వారాల్లోపు ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది.