సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఇన్స్టాగ్రామ్లో దుబాయ్ రిసార్ట్ అకామిడేషన్ డీల్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రకటన చూసి ఆకర్షితుడైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ లింక్ క్లిక్ చేసి సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి రూ.25 లక్షలు పొగొట్టుకున్నాడు. అమీన్పూర్కు చెందిన బాధితుడికి దుబాయ్లోని బుల్గారీ రిసార్ట్ హోటల్ రిజర్వేషన్ టాస్క్లు పూర్తి చేయాలని సైబర్నేరగాళ్లు సూచించారు. ఈ టాస్క్లు పూర్తి చేస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్ బ్లాక్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. దీనికి ఒప్పుకున్న బాధితుడు మొదట రూ.10 వేలు పెట్టుబడి పెట్టి హోటల్ రిజర్వేషన్ టాస్క్లు పూర్తి చేశాడు. దీనికి రూ.40 వేల వరకు లాభం రావడంతో వాటిని విత్ డ్రా చేసుకున్నాడు.
దీంతో సైబర్నేరగాళ్లు చెప్పే మాటలపై పూర్తి నమ్మకం పెరిగింది. ఆ తరువాత వీఐపీ,, కాంబినేషన్ టాస్క్ల్లో భారీగా లాభాలుంటాయని దప దఫాలుగా రూ.25,12,758 పెట్టుబడి పెట్టించారు. స్క్రీన్పై లాభం కన్పిస్తోన్నా విత్ డ్రా చేయకుండా నిలిపేశారు. ఆ డబ్బు విత్ డ్రా చేయాలంటే అకౌంట్ వెరిఫికేషన్ ఫీజుల పేరటి రూ.41 లక్షలు కట్టాలని నేరగాళ్లు ఒత్తిడి తెచ్చాడు. వారి ఒత్తిళ్లతో అనుమానం వచ్చిన బాధితుడు తాను మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.