సైదాబాద్, ఫిబ్రవరి 28 : సైదాబాద్కు చెందిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఫెమా కేసుతోపాటు క్యాసినో నిర్వహణ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం చికోటి ప్రవీణ్ మూడు కోట్ల రూపాయల విలువ చేసే రేంజ్ రోవర్ కారును కోనుగోలు చేయటంతోపాటు, కారును తన పేరుతో కాకుండా బాటియా ఫర్నిచర్ పేరు మీద కొనుగోలు చేయటంతో ఐటీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇతరుల పేరుతో ఉన్న కారును ఎందుకు సీజ్ చేయకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఐటీ అధికారులు జారీ చేసిన నోటీసులకు అన్ని విషయాలతో సమగ్రంగా వివరణ ఇవ్వనున్నట్లు తెలిసింది.